పుట:Shriiranga-mahattvamu.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (సంపుటము 18. సంచిక 2. పుటలు 115-121) యందు భైరవకవి ప్రణీతమైన- కవిగజాంకుశమును- (మానవల్లి వారిచ్చిన ప్రతి) ప్రచురించినారు. దానినే యథాతథముగా నిందు చేర్చినాను. కవి 4 పద్యమున కవిగజాంకుశ మనియు చివరి పద్యమున కవిరాడ్గజాంకుశ మనియు- వ్రాసినాడు.

కవిగజాంకుశము

(భైరవకవి)

క. శ్రీమత్పరమసితానన
    తామరసవికాసలీలఁ దగిలి భ్రమరాం
    బామధుమత్తభ్రమరిక
    నామనసరసీరుహంబునన్ భ్రమియించున్. 1

వ. అని యిష్టదేవతాప్రార్థనంబుఁ జేసి, 2

క. నిరుపమమతివిస్ఫురణం
    బరఁగినసత్కవులఁ దొల్లి బహువిధముల న
    చ్చెరువొందఁ జెప్పవలసిన
    నరనుతసాహిత్యలక్షణగ్రంథములన్. 3

క. సందడిపడు లక్షణమును
    బొందుగ ధవళించి జాగు పోవిడిచి సుధీ
    బృందంబుమెచ్చ నేనొక
    చందమ్ముగఁ గవిగజాంకుశ మ్మనుపేరన్. 4