పుట:Shriiranga-mahattvamu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

పంచమాశ్వాసము


చ.

అవిరళ విష్ణుచింతనపరాయణులై యచట న్వసించు భా
గవతవరేణ్యులం బరమగాత్రులఁ జూతుగదయ్య యంచు ద
త్పరమపవిత్రులౌ మునులఁ బల్మఱు సువ్రతనిష్ఠచారులన్
వివిధవిశేషసత్కృతుల వేమఱుఁ బ్రీతులఁ జేసి సన్మతిన్.

256


వ.

అప్పార్థివోత్తముండు గృతార్థుండై మరలి తరలపతాకాభి శోభితారా
మాతపత్ర భాసురంబును, సముల్లసిత పల్లవతోరణాలంకృతంబును,
బ్రాలంబిత ప్రసూనదామాభిరామంబును, సరస శృంగార పురాంగనాకీర్ణ
సువర్ణసౌధవీథి(థీ) విరాజితంబును, నీరాజనక్రియా సంభ్రమసముల్లాస
విలాసినీచరణ మంజీర శింజితమంజులంబును, వివిధమంగళవాద్యహృ
ద్యంబును, బ్రతిహార సంకులప్రదేశ నియంత్రిత సముత్తుంగ మదముదిత
మధుకరఝంకార ముఖరిత గోపురంబును నగు నిజపురంబుఁ బ్రవేశించి,
సమంచిత సామ్రాజ్య భోగంబు లనుభవింపుచుఁ జతురుదధివలయ వలయిత
వసుమతీభాగం బనురాగంబునఁ బాలించుచుండె. నప్పుడు.

257


ఉ.

ఆతని రాజ్య మొప్పె నిగమాయతజానపదప్రకీర్ణమై,
యాతతవేదశాస్త్రపఠనారవశోభితమై, యుపద్రవ
వ్రాతవిదూరమై, సకలవృత్తవిశేషసమృద్ధిమంతమై,
వీతకళంకమై సతతవిష్ణుమహోత్సవరమ్యదేశమై.

258


క.

శ్రీరమణసుచరితామృత
సారంబై, బహుపురాణసమ్మతమై, సం
సారాబ్ధితారకంబగు
శ్రీరంగక్షేత్ర మొప్పె సిరి పెంపాఱన్.

259


సీ.

గ్రహణకాలంబునఁ గపిలాసహస్రంబు
నవనీసురుల కిచ్చినట్టిఫలము,
భూరియాగములు సంపూర్ణదక్షిణ లిచ్చి
కావించునట్టి సత్కర్మగరిమ,
పసిఁడిపుష్పముల సద్భక్తి సాలగ్రామ
పూజనం బొనరించు పుణ్యమహిమ,