పుట:Shriiranga-mahattvamu.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

పంచమాశ్వాసము


క.

సకలకలికార్షకల్మష
నికరనిరాకరణమహిమ నెగడి మునీంద్ర
ప్రకటిత మగు నితిహాసం
బొకటి గలదు చిత్తగింపు ముర్వీనాథా!

183


సీ.

మును ప్రభాకరుఁ డనుముని, గర్గగోత్రసం
జాతుండు గలఁడు, ప్రశాంతచిత్తుఁ,
డవిరతబ్రహ్మచర్యాన్వితుండు నసమ
ప్రతిభావిశేషసంపన్నుఁ డతఁడు
పటు తపశ్శక్తిమై పరమాయు వేపారఁ
బడసి విశ్వంబరాభార మెల్లఁ
గలయఁ జరించుచుఁ గలకాల మెల్లను
వినుత వేదాభ్యాస మొనరఁ జేసి


ఆ.

పాఠ మొప్ప దానిఁ బఠియింప శక్రుండు
నాకవిపులపాకకలితుఁ డగుచు
చిన్నబోయి యాత్మఁ జింతించి తపమున
నిజమనోరథంబు నెరపఁ బూని.

184


క.

నాలుఁగుదెసల నుదగ్ర
జ్వాలాభీలంబులైన వహ్నుల నడుమం
గాలియ తన కశనముగాఁ
గ్రోలుచు బదియేండ్లు నడచెఁ గొంచక మఱియున్.

185


క.

కొంచెపుటూర్పును బుచ్చక
పంచాబ్దంబులు చరించి పాదాంగుష్ఠం
బించుక ధరపై నూఁది, య
చంచలుఁడై తపము మూఁడుసమముల్ సలిపెన్.

186


ఉ.

ఆయెడ వేదముల్ కడుభయంబున బొందుచుఁ బెక్కువిఘ్నముల్
పాయక చేసినం దరలఁ బారక వాణిఁ దృణీకరించి య