పుట:Shriiranga-mahattvamu.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

233


దనరెడు పుష్కర తీర్థం
బునఁ జిరకాలము వసించి పూతాత్ముండై.

116


ఆ.

లీలం జూచి చూడలేనిసంపద సుఖ
స్ఫురణఁ దలఁచి విషయనిరతిఁ గుంది,
ప్రకటతేజుఁ డగుపరాశరశిష్యు మై
త్రేయమునివరేణ్యు డాయ నరిగి.

117


చ.

వినయవినమ్రుఁడై మొగము వెల్వెలఁ బాఱఁగ నున్నయాతనిం
గనుఁగొని, యమ్మునీశ్వరుఁడు కారణ మెయ్యది? నీవు దీనతం
బొనుపడి యిట్లు డయ్యుటకు భూసురసత్తమ! నాకు జెప్పు నీ
మనసుకళంకు సర్వమును మాన్పెద నావుఁడు నాతఁ డిట్లనున్.

118


చ.

తొడరిన శోకమోహముల త్రొక్కుడులం బడి చిక్కి పైపయిం
బొడము మహోపతాపములఁ బొక్కెడు ప్రాణులపాటుఁ జూచి తా
నడరుచునున్న దుర్భవభయాకులతం గృశియించు నన్ను ని
ట్లడుగఁగనేల నిప్పుడు మహాత్మ సమస్తము నీ వెఱంగియున్.

119


క.

ధీరమతి నెచటి కరిగిన
వారలు మఱి మాతృగర్భవాసములకు రా
రారూఢముగా మోహం
బేరీతిని బాయు, నాకు నెఱిఁగింపు తగన్.

120


వ.

అనిన మైత్రేయుఁ డిట్లనియె.

121


సీ.

నిత్యుఁ, డక్షరు, డాత్మనిశ్చలుఁ డవి రి స
చ్చిదానందభాస్వత్స్వరూపి,
తతగుణాత్మకము, నిత్యము సర్వకా
రణమును, భూతకారణమును దనర్చి,
పరఁగు నీరెంటిలోపలి తారతమ్యంబు
నరసి చూచిన మహదంతరంబు