పుట:Shriiranga-mahattvamu.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

పంచమాశ్వాసము


న్నుతి గనిరిగాదె మును శా
శ్వతకీర్తుల పరమభాగవతులం దెల్లన్.

104


వ.

అట్టి యేకాదశిప్రకారం బెట్టి దనిన.

105


చ.

దశమి ప్రభాతవేళ నుచితంబగు కాష్ఠముఁ బూని, మౌనియై
దశనవిశోధనంబు నుచితంబుగఁ జేసి కృతావగాహుఁడై
కుశలమతింగ్రియల్ నడపి, కోరి హరిం భజియించి యొక్కపూ
టశనము తా భుజించి శుచియై వనితారతిఁ దక్కి వేగినన్.

106


క.

మౌనమునఁ బుణ్యసలిల
స్నానం బొనరించి, సమయసముచితనిత్యా
నూనక్రియాకలాపము
మానక కావించి నియమమానసుఁ డగుచున్.

107


శ్లో.

ఏకాదశ్యా మహం కించి
దనశ్నన్ పురుషోత్తమ।
భోక్ష్యేహని పరేశ్రీమన్
పాహిమాం శరణాగతం॥


వ.

అని సంకల్పంబు చేసి.


సీ.

పరుల నిందింపక, పాషండజనగోష్ఠి
సలంపక, యనృతభాషణము లాడ,
కాగ్రహింపక శూద్రు నంట, కింటనె యుండి,
లలనతోఁ గలయ, కన్యులకు నెగ్గు
సేయక, దుర్జనశ్రేణిసంగతిఁ బోక,
క్రయవిక్రయాదుల కసనిపడక,
కోర్కులు మదిఁ బుట్టకుండ నిద్రింపక,
యనుచితకర్మము లాచరించ,


తే.

కమలమానసుఁడై యచ్యుతావతార
కథలు సద్భక్తి వినుచు భాగవతజనుల