పుట:Shriiranga-mahattvamu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

215


ఉ.

వారు నతాస్యులై ధరణివల్లభుఁ జూచి, నరేంద్ర! దీనికిం
గారణ మేమెఱుంగ మధికంబగు మేలొడగూడుచోట దు
ర్వారములైన విఘ్నములు వచ్చు ననేకము లంచు, భూమిలో
వారలు రూఢిగాఁ బలుకువాక్యము దప్పునె వేయునేటికిన్.

26


క.

నావుడు భూవిభుఁ డిక మన
కేవిధి ప్రజ్ఞావిశేష మేపారు మఖం
బేవెఱవున సంపూర్ణం
బై వెలయునటంచు ఖిన్నుఁడై చింతింపన్.

27


సీ.

అతని కిట్లనిరి వా రందఱు నీరీతి
నవనీశ పరితాప మందనేల
యేదేవుని గుఱించి యీ యాగమును చేయఁ
గైకొంటి వట్టిలోకైకనాథు
నాదినారాయణు, నాద్యంతవిరహితు,
నామ్నాయసంవేద్యు యజ్ఞపురుషు
దేవదేవుని, వాసుదేవుని నధికారు
నచ్యుతు నఖిలభూతాంతరస్థు


తే.

నాశ్రయింపుము హృద్గతంబైన మోహ
పటల మంతయుఁ బాపు నప్పరమపురుషుఁ
డుదయభానుఁడు దిక్కులఁ బొదివికొనిన
యంధకారంబు విరియించు నవ్విధమున.

28


ఉ.

నావుడు సంతసించి నరనాథుఁడు తానును వారుఁ గూడి, స
ద్భావమునం బ్రపన్నపరిపాలనలోలుఁ గృపాలవాలు రా
జీవదళాక్షు నిల్పి పెఱచింతలఁ ద్రోచి నివాతదేశసం
భావితదీపభాతిఁ జలభావ మొకింతయు లేక యున్నెడన్.

29


క.

వారక తమతమ పనులకుఁ
జేరిక చిత్రించి కట్టి చెలువునఁ జేష్టం