పుట:Shriiranga-mahattvamu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

203


విపులవార్వహసందోహవిభ్రమంబు
రుంద్రకటకంబు ధరణిధరేంద్ర మొకటి.

250


క.

అన్నెలవుకు దక్షిణమున
విన్నులతో రాయుచుండ వీక్షించి సము
త్పన్నకుతూహలమతియై
సన్నద్ధసమస్తసైన్యసహితుం డగుచున్.

251


శా.

ఆరాజేంద్రవరుండు తత్కుధరశృంగారూఢుఁడై చేరువన్
ధీరోదంచితనారికేరకదళీతిల్కామ్రఖర్జూరసౌ
వీరాశోకవనావలీకలితకావేరీప్రవాహాంతర
శ్రీరమ్యంబగు రంగమందిరము నర్ధిం జేరి సద్భక్తిమై.

252


క.

తనదృష్టికి నలుదిక్కుల
గనఁబడు దేశముల నమితకనకాంబరగో
ధనరత్నదాసదాసీ
జనముల నర్పించె శేషశాయికి నెలమిన్.

253


క.

భూనాయకుఁ డద్దివ్య
స్థానము మఱిఁ బాసి పోవజాలక యచటం
దా నుండ దలంచి భూసుత
మై నెగడు తదద్రి పశ్చిమాంచితసీమన్.

254


క.

సారసగరుదనిలాహత
సారససంవాసితాంబు సారంబగు కా
వేరీతీరంబునఁ దన
పేరుగ నొకపురి రచించెఁ బ్రీతి దలిర్పన్.

255


క.

ఏపట్టణంబుకంటెను
నాపురవర మమరు విభ్రమాలసలలనా
నూపురరవమంజులమణి
గోపురమై విభవవిజితగోపుర మగుచున్.

256