పుట:Shriiranga-mahattvamu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

199


ప్పునఁ జనుదెంచి యందు గుణభూషణులైన భవత్కులీను లె
ల్లను వివిధోపచారగతులం బరిపూజ లొనర్ప నుండితిన్.

229


ఉ.

ఆగతి నందు నాలుగుమహాయుగముల్ చనునంతఁ జాపదీ
క్షాగురుఁ, డాశ్రితావనవిశారదుఁ డద్భుతబాహువిక్రమో
ద్యోగుఁడు, జానకీదృగసితోత్పలచంద్రుఁడు, రామచంద్రుఁ డా
భాగవతాగ్రగణ్యుఁ డన బ్రస్తుతి కెక్కిన దానవేంద్రునిన్.

230


క.

నిజచరణకమలసంతత
భజనపరాయణునిఁ బరమపావనచరితున్
సుజనప్రియుని విభీషణు
రజనీచరవంశజలధిరాకాచంద్రున్.

231


ఆ.

ఆదరించి తనకుఁ బ్రాణంబుకంటె వి
శేషమైన యావిచిత్రభవన
మిచ్చి యనుప నాతఁ డెలమిమై లంకకుఁ
జనుచు నిచట నున్న సమయమునను.

232


చ.

అమృతప్రాయములైన తోయముల లోకానందముం జేయు నీ
కమనీయాపగనీతటద్రుమసమగ్రచ్ఛాయలం జాల శీ
తములై మించిన సైకతంబులను మోదంబార నీక్షించి ని
త్యము నిచ్చోట వసించుకౌతుకము డెందం బందు సంధిల్లఁగన్.

233


క.

అయ్యసురనాథు నొకగతిఁ
జయ్యన నొడఁబఱచి పంచి సన్నుతఫణిరాట్
శయ్యాతలమున సుఖినై
యియ్యెడ నున్నాఁడ లోకహితనిరతమతిన్.

234


క.

మెచ్చితి నీభక్తికి మది
నిచ్చెద నే వేఁడు మింక నేవరమైనం
జెచ్చెఱ నీమనమున గృప
పిచ్చగిలం బల్కుటయును బ్రీతాత్ముండై.

235