పుట:Shriiranga-mahattvamu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

191


క.

ఆలోన, వారి చిత్తము
లాలోకింపం దలంచి యవ్విపినములో,
నాలోక గోచరుఁడు గా
కా లోకగురుండు చనియె ననుచరయుతుఁడై.

196


క.

అమ్మునివరులును, ద్రిభువన
సమ్మోహన మగు తదీయచతురాకృతిఁ దా
రిమ్ములఁ గనుగొనలేమికి
నుమ్మలికము నెమ్మనముల నుప్పతిలంగన్.

197


సీ.

రాచిలుకలజోక రంతులుగాఁగఁ జ
రించు లేమావుల క్రేవలందుఁ
బరిపరిగతుల షట్పదములు భ్రమరించుఁ
బువ్వారు నెలఁదీవపొదలతుదల
మగకోవెలలు పంచమస్వరంబున నింపు
పుట్టించుమరుగుల పొరుగులందుఁ
గవకవపలుకు జక్కవకవ లిమ్ములఁ
గ్రీడించుకొలఁకుల కెలఁకులందుఁ


తే.

గలయ మెలఁగుచుఁ బలుమఱుఁ బిలిచి పిలిచి
చొలవకెల్లందుఁ బరికించి చూచి చూచి
యలఁత దలఁకొన మనముల నలసి యలసి
కానలే రైరి యెబ్బంగిఁ గమలనేత్రు.

198


క.

ఆహారనిద్ర లెఱుఁగక
యాహరి సందర్శనోత్సవాకులమతిఁ ద
ద్వాహినిపొంత ననాదృత
దేహవ్యాపారు లగుచుఁ ద్రిమ్మఱుచుండన్.

199


వ.

కొండొకకాలంబు చన నొక్కనాఁడు నభోమండలంబున నొక్కవాక్యం
బిట్లని వినంబడియె.

200