పుట:Shriiranga-mahattvamu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

చతుర్థాశ్వాసము


వొంది, రప్పు డిరువురుఁ దదభివందనం బాచరించి నిటలతటంబున నంజలి
పుటంబులు వొందించి నిలిచి రందు మహీసురుం డిట్లనియె.

171


సీ.

వినుఁడు సన్మునులు నావిన్నపం బేనొక
ధరణీసురుండ, నీధాత్రిమీదఁ
గలపుణ్యతీర్థముల్ క్రమమున నాడుచు
నిటకు నేతెంచుచో నిప్పిశాచి
త్రోవఁ బెబ్బులిరూపుతో నుండి పట్టిన
బట్టీక నేఁ దన్నుఁ బదరుటయును
దప్పు నాయదికాదు దైవంబు దనియెఁ దా
నాగి శుభాశుభముల నొందుచోట


తే.

హేతువగుఁ గర్మ మంటినే, నివ్విధమున
వరుస నపుఁగా దనంగవివాద మెసఁగె,
బూని గెల్చినవానిచే హీనవాది
చచ్చు ననుచు మాలోన నిశ్చయము చేసి.

172


క.

ఇరువురమును మీసన్నిధి
కరుదెంచితి, మిందు యుక్తమగు నిది యని మీ
రరసి తగఁ జెప్పుఁ డనుటయు
మఱి పలికెఁ బిశాచి మునిసమాజముతోడన్.

173


ఉ.

ఏనొక కర్మయోగమున నిట్టి పిశాచపుజన్మ మెత్తితిం
గాని, మదీయబుద్దిబలగౌరవ మేమియుఁ దప్ప దవ్విధం
బైనను, జాతియుక్త మగునట్టిక్రియాగతి నీతఁ డొంటిమై
రా నిటఁ బట్టితిం జయపరాజయముల్ వివరింపుఁ డేర్పడన్.

174


వ.

అనిన నయ్యుభయమతంబులందుఁ బూర్వపక్షసిద్ధాంతంబుల నేర్పఱుప
నేర్పరులు గాక తమలో వితర్కించు మునులకోలాహలం బగ్గం బయ్యె
నయ్యెడ.

175


సీ.

పుండరీకాక్షుఁ డంభోధరశ్యాముఁ డా
జానుబాహుండు విశాలవక్షుఁ