పుట:Shriiranga-mahattvamu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

185


వ.

అనిన బ్రాహ్మణుం డిట్లనియె.

164


ఆ.

సకల భూతములకు సాక్షియై వర్తించు
దైవమునకు నేమితప్పు చెప్పు
వరుసఁ గీడు మేలు పొరయంగ నిజకృత
కర్మఫలమ తనకుఁ గర్తగాక.

165


వ.

అనిన నప్పిశాచి యిట్లనియె.

166


చ.

తెలియవు నీవు తత్త్వగతి తెల్లముగాఁగఁ జరాచరంబునం
గలిగిన యీశ్వరుం డొకఁడ కర్తయు, భోక్తయుఁగాక కల్గ దె
వ్వలనను దద్వయుక్తమగు వస్తువు గావున మేలుగీడునుం
దలకొన భూతరాసుల కొనర్పఁగ శక్యమె కర్మకోటిచేన్.

167


ఆ.

కర్మఫలములందు కర్తయు భోక్తయు
శ్రుతులు చాఁటు నీశ్వరుండు కర్త
యయ్యెనేసి తత్క్రియాశక్తి యతనికి
నొదవుగాన నీదురుక్తు లుడుఁగు.

168


వ.

అనిన నగి యతని కిట్లనియె.

169


క.

ఆరయ నీవిశ్వమునకుఁ
బ్రేరకుఁ డీశ్వరుఁడు తద్వ్యపేతం బగుచుం
బూరియునేని చలింపఁగ
నేర దతం డొకఁడ కర్త నిఖిలంబునకున్.

170


వ.

అని యివ్విధంబున మఱియును గొండొకసేపు వివాదంబు సేసి యమ్మేదినీ
సురుం డిట్లను నిచ్చోటి కనతిదూరంబుర నామ్రతీర్ధంబు చెలువొందు,
నందు మహామునిబృందంబు గ్రందుకొనియుండు, వారిముందట మన
మందటలు చెప్పి నీవ గెలిచిన నన్ను భక్షింపు, మేన గెలిచిన నిన్ను వధియించెద,
నని ప్రతిన గావించె, నదియును సమ్మతించి యట్లొడంబడి తత్తీర్ణ
వాసుల సకాశంబునకుం జనిన మానవానుగతయైన పిశాచిం జూచి యచ్చెరు