పుట:Shriiranga-mahattvamu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

చతుర్థాశ్వాసము


వారించి నాకడం జను
వారై పొందుదురు తుది నవారితసుఖముల్.

147


వ.

అని యానతిచ్చి యాచతుర్భుజుండు నిజధామంబున కరిగిన సుత్రాముండు
నతిపవిత్రంబులగు నత్తీర్థోదకంబులఁ గ్రుంకి పాపపంకంబు నపనయించి
సమంచితతేజోవిరాజమానుండై శ్రీరంగరాజచరణరాజీవసందర్శనాభి
వందనం బొనరించి, తనర్చి, పెంపున నిలింపానీకంబు గొల్వ నాకంబునకుం
జని, యఖర్వవైభవంబునం బూర్వప్రకారంబున నుండె నని చెప్పి
యక్కాశ్యపమునీంద్రుఁడు వెండియు నిట్లనియె.

148


సీ.

భూనాథ! నీవు నీ పుణ్యతీర్థంబున
నవగాహనము సేయ నఘము లడఁగు,
మున్ను సిద్ధులు మునిముఖ్యులు నిచ్చోట
నిలచి రాగద్వేషములఁ దొలంగి
యధ్యాత్మవిద్యాపరాయణులై కాంచి
రాత్మాభిలషితంబు లైనగతుల,
రాజ్యవిచ్యుతుఁడైన రాజు మజ్జన మిందుఁ
గావించి మూఁడులోకములు నేలుఁ


తే.

గోరి యీవారిలోపలఁ గ్రుంకువెట్టి
వనిత సత్పుత్రుఁ గను, మూడుదినము లుపవ
సించి త్రిషవణస్నానంబు సేయునతఁడు
సప్తజన్మాఘవితతిఁ తత్క్షణమ పాయు.

149


క.

నేమమున నిజ్జలంబుల
లో మజ్జనమాడు మనుజలోకమునకు నా
నామయములు నవయుఁ దృణ
స్తోమము శిఖిశిఖలఁ గాలుచొప్పున ననఘా.

150


క.

కావునఁ బనుపుము నీసై
న్యావలి, నీవిమలవారి నవగాహనముం