పుట:Shriiranga-mahattvamu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

చతుర్థాశ్వాసము


కోరి విన్నఁ బేరుకొన్న విలోకింపఁ
గను దలంగు నఖిలకల్మషములు.

108


క.

నిరుపమనితాంతమహిమం
బరఁగెడి తత్తీర్ధమున, సమంచితనిష్ఠా
నిరతుఁడు కాశ్యపుఁ డనియెడు
ధరణీసురవరుఁడు మున్ను తప మొనరింపన్.

109


చ.

అరినరపాలదుర్మదమహాగజకేసరి, కాశికాపురీ
శ్వరుఁడు, సుకీర్తినాఁ బరఁగువాఁ డొకనా డట నేఁగుదెంచి చె
చ్చెర బహురోగపీడలఁ గృశించి నశించెడియాత్మసేనఁ ద
త్పరమపవిత్రతీర్ధసవిధంబునఁ గావఁగ బూని సమ్మతిన్.

110


క.

ఆ విధమున చతురంగబ
లావృతుఁడై వచ్చి తనకు నభివందనముం
గావించి యున్న యావసు
ధావరునకు నత్తపస్వి తా నిట్లనియెన్.

111


ఉ.

ఎయ్యెడనుండి వచ్చి తిట కెవ్వఁడ వీవు భవన్మనోరధం
బెయ్యది చెప్పు మిప్పు డది యిందును నందును బోల దుర్లభం
బెయ్యది యైనఁ గైకొని రయంబున నేనొనరింతు నీపయిన్
నెయ్యము మించె నాకు ధరణీవర నావుడు నమ్మునీంద్రుతోన్.

112


క.

అతనికి నిట్లను కాశీ
పతి యగుసుబలాత్మభవుఁడఁ బరమసుకీర్తిన్
నుతపుణ్యతీర్థసేవా
వ్రతనిష్ఠానిరతి నిటకు వచ్చితి ననుడున్.

113


చ.

మునివరుఁ డిట్లనుం బరమపుణ్య యెఱుంగుమ మున్ను నేను నీ
జనకు నానృపాలునకు సౌఖ్యమె రాజ్యముతో డొనర్ప కీ
వనుపమనవ్యభోగముల నందక యీగతిఁ గందమూలభో
జనములఁ గుందుతాపసుల జాడల నొంటిఁ జరింప నేటికిన్.

114