పుట:Shriiranga-mahattvamu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము


వాదియును నైనమాధవి సాదరమున
నొసఁగె, నొకదిన మచటఁ దా నున్నఫలము.

52


క.

చెందిన దత్పుణ్యము వసి
గం దరుణీ యుండు మింకఁ, గల్ఫక్షయమౌ
నందాక బ్రహ్మలోకము
నం దవ్యయదివ్యసుఖసమన్విత వగుచున్.

53


చ.

అని శమనుండు వీడ్కొలుప నారమణీమణి సమ్మదంబు నె
మ్మనమున నిండ నుద్యదహిమద్యుతి మండలరుగ్విడంబి నూ
తనమణిమాలికావిలసితం బగుదివ్యవిమాన మెక్కి పెం
పెనయఁగ బ్రహ్మలోకమున కేఁగె సురల్ వెఱఁగంది చూడఁగన్.

54


క.

మాధవియు నిచట ననితర
సాధారణ మైనతపము సలుపుచుఁ గరుణాం
భోధిఁ గమలాధిపతి నా
రాధించి తదీయచిరపదస్థితి నొందెన్.

55


వ.

ఇ ట్లఖిలభువనవిశ్రుతంబైన యశ్వత్థతీర్ధంబునఁ గృతస్నానుండవై దేవర్షి
పితృతర్పణంబు లొనర్పుము. ఈయితిహాసంబు వినువారికి దురితనిరా
సంబును, బుణ్యలోకశాశ్వతనివాసంబును సిద్ధించు నని పలికి వాల్మీకి
మునీంద్రుండు వెండియు నేమి వినవలతు వని యడిగిన నమ్మహాత్మునకు
భరద్వాజుం డిట్లనియె.

56


క.

ఘనదురితక్షయకరమై
చను నీయశ్వత్థతీర్థసామర్ధ్యం బిం
కను విన వేడుక యయ్యెడి
మునివర నా కెఱుఁగఁ జెప్పుము కృపామతివై.

57


వ.

అనిన నత్తపస్వివరేణ్యుం డతని కిట్లనియె.

58


తే.

వినుము వెండియు నొకపురావృత్త మనఘ!
ముందుఁ గణ్వుండు నా నొప్పు మునివరుండు