పుట:Shriiranga-mahattvamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

చతుర్థాశ్వాసము


న్గొని చెప్పె, మఱియు నయ్యెడ
జనవినుతార్థంబులైన షట్తీర్థంబుల్.

4


చ.

అన విని శౌనకాదిమును లందఱు డెందములందు సమ్మతం
బెనయఁగ సూతపుత్రునకు నిట్లని రట్టి విచిత్రసత్కధల్
విన మిట మున్ను మాకు విన వేడుక యయ్యెను శక్తిపౌత్రుఁ డా
తని కెఱిఁగించినట్టి సముదంచితతీర్థము లాఱుఁ జెప్పుమా.

5


వ.

అనిన — మునీంద్రబృందంబునకు సూతనందనుం డిట్లనియె.

6


క.

ఇప్పుడు నను మీ రడిగిన
చొప్పున, ము న్నఖిలతాపసులు గూడి ప్రియం
బొప్పారఁ దన్ను నడిగిన
నాపుణ్యాత్ములకు బాదరాయణుఁ డెలమిన్.

7


క.

వినిపించె నట్ల తగ న
మ్మునివరునకుఁ జెప్పఁ దొడఁగె మున్నసమతపో
ధనుఁ డైన భరద్వాజుఁడు
తనశిష్యులు గొలువఁ తీర్థతత్పరమతియై.

8


సీ.

తపసియుఁ జని కంచి దర్శించెఁ, గేదార
మాడె, గంగాద్వార మధిగమించె,
సింహాచలంబు నీక్షించెఁ గురుక్షేత్ర
మరిగెఁ బుష్కరముల ననుసరించెఁ,
కాశికాపురి నవగాహంబు సేసెఁ బ్ర
యాగంబునందు గయావటంబు
గదిసె, గోదావరిఁ గాంచెఁ, గృష్ణానది
భజియించె, శ్రీరంగభర్తఁ గొలిచె


తే.

సన్నుతించె నహోబలస్వామిఁ బ్రణుతి
సేసె శ్రీ వేంకటాచలవాసి నెలమి