పుట:Shriiranga-mahattvamu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

151


చ.

అరుగుము నీవు, దుస్తరమహాఘనివారిణియైన చంద్రపు
ష్కరిణికి, నందు భక్తి నవగాహ మొనర్పుము - దాన నీకగున్
బరమశుచిత్వ, మంత భవబంధవిమోచనుఁ బద్మలోచనున్
హరిఁ బరమాత్ము గాంచెద వుదంచితధాముని రంగధామునిన్.

291


క.

ఆదేవుని, నాశ్రితర
క్షాదక్షునిఁ గొలిచి, తత్ప్రసాదంబున నీ
ఖేదంబుఁ బాసి చనియెదు
మోదంబున నిజనివాసమున కుడువీథిన్.

292


క.

అని యెఱిఁగించిన, వినయం
బెనయఁగ గంధర్వుఁ డమ్మునీంద్రున కభివం
దన మాచరించి వీడ్కొని
చని గంధర్వుఁడు విరక్తిసంపన్నుండై.

293


మ.

పరమోత్కంఠ నకుంఠితస్థితి పురోభాగంబునం గాంచెఁ బు
ష్కరిణీతీర్థము - నాత్మతత్పరభజద్గంధర్వగీర్వాణకి
న్నరసంపాదితకామితార్థము, ననూనస్ఫారనీరేజకే
సరనిర్మన్మకరందతుందిలపయోజాతోర్మికాసారమున్.

294


వ.

కని విస్మయంబు నొంది - నిజస్మరణమాత్రగళితకలుషకజ్జలంబు లగు
తజ్జలంబుల మజ్జనం బాచరించి, విశుద్ధశరీరుండై, కవేరకన్యకాతీరసహకార
కోరకమోదమేదురమలయమారుతావతారరజతగరుడకేతనాభిరామం
బగుశ్రీరంగధామంబుఁ జేరి, యచ్చట నభంగసంగతప్రసంగంబున
నారమామనోహరు చిత్తంబు ప్రసన్నతాయత్తంబు సేయం బూని, మొదల
నాదసముద్భవంబులై మంద్రమధ్యమతాళభేదంబులఁ దమవలన నేక
వింశద్విధంబులైన శ్రుతులకు నాధారంబులై మయూరాదిరుతంబులచేత
సంకేతం బగుషడ్జాదిసప్తస్వరంబుల పరస్పరమేళనంబున నభిరామం
బగుగ్రామత్రయంబు నవలంబించి మతంగతుంబురునారదకోలాహ
లోదితంబు లగుమతంబుల ననేకప్రకారంబు లైనమూర్ఛనల నింపు
గడలొత్తు చతురుత్తరాశీతితానంబుల ననూనంబులై, సంపూర్ణషాడబ