పుట:Shriiranga-mahattvamu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

149


దను భజియింప నావికచతామరసేక్షణుఁ డాసమాశ్రితా
వననిరతుండు శ్రీహరి ధ్రువంబున మాన్పెడిఁ దాన యాతనిన్.

279


క.

అని చెప్పి యబ్జగర్భుఁడు
చనియె న్నిజధామమునకు శంభుఁడుఁ బోయెన్
వినుతమణిశృంగసంగత
ఘనపటలవిలాసమునకు గైలాసముకున్.

280


చ.

హరిహయుఁ డంత నిష్టసఖుఁడై పెనుపొందెను జిత్రసేనుఁ డం
బరగతి పాటవం బెడలి పడ్డప్రదేశము కేగి వానికిన్
సరసిజసూతి వాక్యములచందము పొందుపడంగఁ జెప్పి-తా
నరిగె నిజాగమోత్సుకసుధాశనకోటికి వేల్పువీటికిన్.

281


వ.

ఆగంధర్వరాజును నిజవ్యతిక్రమంబునకు నిర్వేదించి యచ్చోటు వాసె, కాశ్యప
నామధేయుండు నగుమునీశ్వరుఁ బొడగని యభివందనం బాచరించి
వినయవినమితమస్తకుండై హస్తకమలంబులు మొగిచి యిట్లనియె.

282


క.

దురితానలకీలావలి
నెఱిఁ జెడి నా కేదికృత్య మెయ్యది వాచ్యం
బిరవుగ నేమిట సౌఖ్యముఁ
బొరయుదు నెఱిఁగింపవే తపోధనముఖ్యా!

283


వ.

అనిన నయ్యతివరుండు గంధర్వవరున కిట్లనియె.

284


మ.

పరమేశుం బురుషోత్తం బరుఁ, గృపాపాథోధి, నారాయణున్
హరిఁ జిత్తంబున నిల్పి-నిత్యము ప్రణామాభ్యర్చనాదిక్రియా
పరతం గార్యము దీర్పు, మట్లయినఁ బాపశ్రేణిఁ బోఁదోలి-త
త్పరమస్థానముఁ బొందె దెంతయును గోప్యం బే నెఱింగించితిన్.

285


క.

నావుఁడు నప్పరమేశ్వరు
నేవెరవున నెఱుఁగబోలు - నేచందము, వాఁ