పుట:Shriiranga-mahattvamu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

145


చ.

హితుఁ డగుచిత్రసేనునకు నిట్టివిధంబున వచ్చినట్టి దు
స్స్థితి విని యల్కమై నమరసేనల నెల్లను గూర్చి యాశత
క్రతుఁడు ముకుందకింకరనికాయముపైఁ జని-పోరి వారిచే
హతబలులై నిలింపులు భయంబున కన్కనిఁ బాఱిిపోయినన్.

245


క.

ధట్టించి నిలిచి వజ్రము
కట్టలుకం బూని వైవఁ గైకొన కది చే
పట్టుకొని కుముదుఁడును నతఁ
డిట్టాలం బనుచుఁ జెప్పునెద నచ్చటికిన్.

246


వ.

మున్ను చిత్రసేనునిచేతను బరిభూతం బగురాజశేఖరుం డరుదెంచిన విరించి
యత్యాదరంబున నమ్మహాదేవుతో నీవేమి కార్యంబున కిచ్చటికి వచ్చితనిన
నచ్చతురాననుం గనుంగొని.

257


క.

క్షితి చిత్రసేనపతనము
నతనికినై తనబలంబు నని కనుపుటయుం
ధృతి చెడి వారలు-హరిభట
తతిచే నొచ్చినవిధంబు తడయక చెప్పెన్.

258


క.

చెప్పిన విని గంధర్వుం
డొప్పని పని సేసెఁ దెలివి మానక నీవుం
దప్పితివి బుద్ధి సురపతి
చెప్పెడి దేమున్న దిట్టి సెగ్గెము నొందెన్.

259


చ.

అని జలజాసనుండు దివిజాధిపుఁ గన్గొని దైవకృత్య మె
వ్వనికి నతిక్రమించి చన వచ్చునె పుణ్యపరుల్ శుభంబులం,
ఘనదురితాత్ము లాపదలు, గైకొనుచుండుదు రట్టికర్మముల్
దనవశమే యొనర్పఁగ విధాతృనియోగమె కాక సర్వమున్.

260


క.

జీవుల శుభాశుభస్థితు
లేవిశ్వాత్మకుఁ డెఱుంగు నెల్లప్పుడు నా