పుట:Shriiranga-mahattvamu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

142


గాటమ్మునకు నోహటించి - విముక్తరణపాండిత్యు లగునాదిత్యులు,—
విస్మృత హరిత్తు లగుమరుత్తులును, విగళితగంధర్వు లగుగంధర్వులు,
విఘూర్ణితాతు లగుయక్షులు, వితతశతవేదనాసాధ్యు లగుసాధ్యులును,
వికంపితాసువు లగువసువులునునై, రివ్విధంబున నిజబలంబులు దక్కి
నలుదిక్కులకుం బఱచిన సురపతి తా నొక్కరుండ చిక్కి మిక్కుటం
బగుకోపాటోపంబున.

237


శా.

శుంభద్రోషమునం దిశల్ పగుల నక్షుద్రజ్వలజ్జ్వాలికా
సంభూతస్ఫుట విస్ఫురద్విసృమరస్ఫాయత్స్ఫులింగవ్రజం
బంఖోవాహపదంబు గప్పికొన జంభారాతి వైచెన్ రణా
రంభోజ్జృంభితమైన వైష్ణవభటవ్రతంబుపై వజ్రమున్.

238


క.

ఆరీతి భూతభయదం
బై రయమున వచ్చు వజ్ర మతులితబరిదు
ర్వారుఁ డగుకుముదుఁ డచ్చెరు
వారఁగ డాకేలఁ బట్టె ననుచరు లార్వన్.

239


ఉ.

ఆతఱి సర్వపర్వతచయాతతపక్షవిభేదనక్రియా
హేతుకమై దనర్చు నిజహేతి-వికుంఠితమై యరాతికిం
జేతికి నగ్గ మౌటఁ గని సిగ్గఱి శక్రుఁడు వాఱె- దైత్యజి
ద్దూతలు వెంటవెంటఁ బడి తోలుచుఁ గేలిఁ గొనంగ మౌనియై.

240


చ.

హరిహయుఁ డాదిగా గల సురావలి నాగతి గెల్చి-విష్ణుకిం
కరులు జయోత్సవం బెసఁగ, గ్రమ్మఱి వచ్చినఁ దన్మహోగ్రసం
గర ఘనఘోష మచ్చట సుఖస్థితి నున్నమహాత్ము లాలకిం
పరు పరమాత్మచింతనముఁ బాయక యన్య మెఱుంగ కుండుటన్.

241


వ.

అంత నక్కడఁ బరాభవజాతమన్యుండై వచ్చుశతమన్యుదైన్యం బాలోకించి
లోకపితామహుం డతని డాయంజని.

242


క.

ఎవ్వరిచే నేనెపమున
నివ్విధి వాటిల్లెఁ జెప్పు మేర్పడ ననినన్