పుట:Shriiranga-mahattvamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

తృతీయాశ్వాసము


తే.

సంభ్రమించుచు, వీరి నీజాడఁ బరపి
నట్టి బలియుఁడు నెవ్వడో యనఁ దదంతి
కమున కేతెంచి వినయుఁడై క్రౌంచభేది
చేప్పెఁ దా రేఁగి విఱిఁగి వచ్చినతెఱంగు.

226


వ.

అంత నంతయు విని యుమాకాంతుం డఖిలభూతజాతం బాకర్ణింప బలవం
తులతోడి విరోధంబు గాదనిపల్కి యాగంధర్వునిం జూచి-నీ వెందైనను
బొందైన కందువ కరుగుమని యంతరార్థంబున నుండెఁ, దదనంతరంబ నిజ
మిత్రుం డగుఖేచరత్వంబు చెడి పుడమిఁ బడి యడలుచునీకి తదనుచరుల
వలనఁ రిలిసి యాశతమన్యుండు ధృతమన్యుండు నయ్యె, నయ్యెడ-

227


క.

లోచనసహస్రలోహిత
రోచులు మెయినిండ - నామరుత్సాలుఁడు లో
నేచిన రోషాసలకీ
లాచయములు వెలిఁ దలిర్చులాగున నుండెన్.

228


వ.

అంత.

229


ఆ.వె.

దంతి, మేష,మహిష, దానవ,మకర, సా
రంగ, తురగ,శాక్వరముల నెక్కి
కులిశ శక్తి దండ ఘోరాసి పాశ-తో
మర గదాత్రిశూలధరులు నగుచు.

230


ఉ.

ఆహవశూరులై వెడలి రప్పుడు తక్కును గల్గు దేవసం
దోహము లాత్మచిహ్నములతో వివిధాయుధపంక్తితో, నట
ద్వాహనకోటితో, సుభటవర్గముతో వెస నిర్గమించి-ర
వ్యాహత సింహనాదముల నంబరభాగము పూరటిల్లఁగాన్.

231


క.

ఆ దివిజగణము తమతమ
కైదువుల మెఱుంగు లెల్లకడలం బర్వం
గా దనరెఁ దఱుచుమెఱపుల
తో దివిఁ బన్నిన యుగాంతతోయదము లనన్.

232