పుట:Shriiranga-mahattvamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

135


తే.

తెలిసి నలుదిక్కులను జూచి, ధృతిఁ గలంగి
యిక్కడెక్కడ నన్నెవ్వ రివ్విధమ్ము
జేసి రని పల్కు నాచిత్రసేనుతోడ,
వారుఁ జెప్పిరి తద్విపత్కారణంబు–

201


క.

చెప్పిన విని, బెడగుచు మదిఁ
గప్పిన మోహమున మీఁదుగానక పోదం
డప్పగిది నుండ నేలని
యప్పాఱుం డరుగఁజూచె ననుచరయుతుఁడై.

202


వ.

ఇట్లు చన మొక్కలించి ఱెక్కలు విఱిఁగిన పులుగులంబోలె–నాకసంబున
కెగయలేక, చీకాకుపడి యార్తుం డగుచు, మర్త్యుకైవడి పుడమిం బడి
పొరలి యాక్రోశించుచు.

203


మ.

అకటా యే నతిమూఢభావమున నీయత్యంతసంతాపహే
తుకకర్మం బొనరించినాఁడ, నిఁక నీదోషం బశేషంబు, నూ
రక యెబ్భంగిఁ దొఱంగు, దీనికి విచారం బెద్ది యన్యాయకా
రికి నేలోకమునందు నాపదలు వర్తిల్లున్ దురంతంబులై.

204


వ.

అని యొక్కింత చింతించి మఱియును.

205


మ.

దివి మీముందట వచ్చు నన్నిటు బహిర్ద్వీపంబునం దేవదా
నవమర్త్యాదులలోన నెవ్వరోకొ ప్రాణత్రాణ నిష్పాశులై
యవిచారంబున వైచి రాజడుల నింద్రాఖర్వరోషాగ్నిను
ద్దవిడిన్ వేలిచి తత్ఫలంబున హవిర్భాగంబు భాగించెదన్.

206


క.

అదిగాక వానిఁ జెప్పిన
నొదవెడు భద్రంబు మీకు నుద్దీపితమై,
యిది యటుపోనిం డిపు డు
న్నది యిఁక నొకసంశయంబు నామదిలోనన్.

207


ఉ.

అప్పుడు మీకు నాకును వియద్గమనంబు సమంబ-యిట్టిచో
నిప్పుడు నాకు నొక్కనికి నిత్తెఱఁగై మఱి మీగతిక్రమం