పుట:Shriiranga-mahattvamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

తృతీయాశ్వాసము


వ.

అని పలికి రపు డాబ్రహ్మహత్య తద్దేశంబున సద్యోనాశంబు నొందె,
నవ్విష్ణుభూతేశ్వరులు తమతమనిలయంబులకుం జనిరి, తదనంతరంబ జగత్
సృష్టికారణంబైన మహావృష్టి గురిసి కఱవు దీఱి యెల్లవారు తమతమ నెల
పుల సుఖంబుండిరి, యీయుపాఖ్యానంబున నిఖిలపాపహరణంబగు నిహపర
సుఖదం చెప్పి యప్పారాశర్యుండు నాగదంతమునివరున
కిట్లనియె.

195


క.

ఈ కథ వినియెడి మనుజు ల
నేకమహాపాతకంబు లెడలియు, ముక్తి
శ్రీకాంతు లగుదు, రట్టిది
నీకొకకథ యోగివర్య నే నెఱిఁగింతున్.

196


మ.

ఒక గంధర్వుఁడు చిత్రసేనుఁ డనువాఁ డుద్దామదర్పోదయా
ధికుఁ, డస్వప్నవరేణ్యమిత్రుఁ డుడువీధిం దోడిగంధర్వగా
యకులుం దానును బాడుకొంచు నట రంగాభ్యర్ణముం జేరి, కొం
జక యామీఁదటగా వెసం జనియెఁ దచ్ఛాయాసముల్లంఘియై.

197


ఆ.వె.

వానితోడ నేఁగువారు తచ్ఛాయ న
తిక్రమింపరామి దెలిసి, నిలిచి,
రంతతీర్థరక్షు లాదుర్మదాంధుని
సాగి పోవనీక సంభ్రమమున.

198


క.

కడకాలఁ బట్టి, కడు నురు
వడి బిఱబిఱ ద్రిప్పివైవ వననిధి కవలం
బడియె రఘునాథు శరహతి
సుడిఁబడి మారీచరాక్షసుఁడు పడినగతిన్.

199


వ.

అప్పుడతనితోడఁ గూడివచ్చిన గంధర్వు లావిధంబెల్లఁ దెల్లంబుగాఁ
గనుగొని బెదరి మగిడి నిజాధిపతియగు చిత్రసేనుండు తేజోహీనుండునై
పడినయెడకుం జని, యచట నచేతనుండై యున్న యతనిఁ
బ్రబోధించిన—

200