పుట:Shriiranga-mahattvamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

121


యురువైభవమున నయోధ్యాపురికి వచ్చి
యచట సుగ్రీవాదు లైనహితుల-
కుచిత సంభావన లొనరించుతఱి నతి
ప్రియకారియైన విభీషణునకు
నాత్మకులీన కృపారాధితంబును-దన
కంటె నుత్కృష్టతరము నైన-


తే.

రంగధామంబు సదయాంతరంగుఁ డగుచు
నొసఁగుటయు నాతఁ డదిగొంచు నసమహర్ష
మెసఁగ నిజపట్టణమునకై యేఁగుచుండ
మార్గవశమునఁ గావేరి డగ్గఱుటయు,

126


వ.

అపుడు మధ్యాహ్నసమయం బగుట-నతండు తత్ప్రదేశంబున తద్దివ్యమంది
రంబు నిలిపి దేవతార్చనార్థంబు పుష్పోపహరణంబునకై వనం
బున కరిగి-యచటఁ బరమతపోనిష్ఠులఁ గని సంభాషించి వారిచేత సంభా
వితుండై -తత్సమేతంబుగా నేతెంచి శ్రీరంగరాజపూజావిధానంబుఁ దీర్చు
టయు-ననంతరంబ గమనోన్ముఖుండై యద్దశముఖానుజుం డుద్దామతేజోభి
రామం బగు రంగధామంబు వహింపం బూని తరలింపలేక శోకాకులం
డగుటయు నాదనుజపుంగవుం గరుణాతరంగితంబు లగునపాంగంబుల
నిరీక్షించి లక్ష్మీశ్వరుం డతనిపై లక్ష్యం బుడిపి, యాశశాంక పంకజాప్తంబుగా
నిరాతకం బగులంకాధిపత్యంబున కనిపి-యసమాస సంతతానందుండై -
యుండుటయు-నది కారణంబుగాఁ దత్సమీపం బఖిలపాపంబుల లోపంబు
సేయనోపుటయుఁ జెప్పి దండధరుండు వెండియు వారల కిట్లనియె.

127


క.

మీవశమె విష్ణుభూతే
శావజ్ఞయుఁ దత్పరిగ్రహ నిపీడనముం
గావింప వారితోడం
బోవం బనిలేదు కలిగెఁ బోయినఫలమున్.

128


క.

అన్నెలవున గల భూతము
లన్నియు నజ్ఞానపాత మన్నియు సుఖసం