పుట:Shriiranga-mahattvamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

తృతీయాశ్వాసము


క.

విలయసమయమునఁ గలజడి
నలజడిఁ బడి భువననిషహ మడఁగెడు నపుడున్
జలశాయి నిలయ మగునీ
లలిత క్షేత్రము నిరాకులతఁ బొలుపారున్.

111


ఆ.వె.

సర్వశక్తిమయము జగతి శ్రీరంగంబు
సర్వతీర్థమయము చంద్రసరసి
సర్వపుణ్యమయము చర్చింప నీరావు
సర్వవేదమయుఁడు శార్ఙ్గపాణి.

112


వ.

ఈశూద్రుం డతిపాపకర్ముం డయ్యు నీపుణ్యప్రదేశంబున నుండి సమాధి
యోగంబునంజేసి శుద్ధాత్ముం డయ్యె, నిది గాదని బలిమిం బట్టికొనిపోవ
మీవశంబు గాదు, పనిలేని దురభిమానంబునఁ బొరలక మఱలిపొం డనిన
నొండన వెఱచి యాశమన దూత లాపని విడిచి పఱచి రనంతరంబ-

113


సీ.

నిర్మలుండును, సత్వనిధియును శుద్ధాంత
రంగుండు, నగుశూద్రపుంగవుండు,
వెస సముద్ధితుఁడైన, వెఱవకు మికనంచు
భూతేశ్వరులు గరంబులఁ గరంబు
నతుల తదీయకాయస్పర్శ గావించి
రతఁడును భక్తిమైఁ బ్రణుతి సేసి-
పుష్కరిణీతీర్థమున కేఁగి తనివోవ
నం దవగాహన మాచరించి-


తే.

తత్తటంబున నురుతపోవృత్తి నున్న
సన్మునీంద్రుల దర్శించి సమ్మదమున
వందనము చేసి తానును వారిఁ గూడి
యర్థి శ్రీరంగభవనంబు కరిగియందు.

114


సీ.

శరదిందుమండల స్వచ్ఛాహిపర్యంక
భాసురు నపసవ్యపార్శ్వశాయి,