పుట:Shriiranga-mahattvamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

తృతీయాశ్వాసము


క.

ఎయ్యవి సదసత్తులు పర
మెయ్యది దానికిఁ దలంప నెద్ది యజాతం
బయ్యును బహుప్రజాతం
బయ్యెసఁగుచునుండు భూసురాగ్రణి చెపుమా!

19


వ.

అనిన నయ్యుత్తమద్విజునకు నజునికొడు కిట్లనియె.

20


మ.

మతి నే ని న్నొకవిప్రమాత్రుఁ డని నమ్మంజాల, యుష్మత్సమ
ప్రతిభుల్ శిష్యులు నిట్టిచందము దలంపన్, మాదృశానుగ్రహాం
చితబుద్ధిన్ వసుధావతీర్ణుఁ డగులక్ష్మీభర్త వీమూర్తిసు
స్థితియుం దేజము నున్నవారలకు నేదీ యట్లు గాకుండినన్.

21


క.

నీ వడిగినప్రశ్నములకు
భావం బిది యని యెఱింగి ప్రత్యుత్తర మీ
నావశమె ఘనతరప్ర
జ్ఞావంతుల కైన నది యశక్యం బనినన్.

22


వ.

సకలవేదాంతరహస్యవేది వగు నీవు దక్కఁ దక్కినవార లిట్టిప్రశ్నలు
గావింప వానికిఁ దగిన యుత్తరంబులు చెప్ప నసమర్థులు, గావున నాదెసం
గలుగు కరుణాగుణం బేర్పడ నెంతయు నీవు దెలుపు మని ప్రార్థించిన
నమ్మహానుభావుం డిట్లనియె.

23


సీ.

ఎల్లవర్ణములకు నెప్పుడు గార్యంబు
ధర్మంబు మఱి సుకృతంబు బాయ
రనిశంబు దివ్యశక్త్యావిష్టుఁ డగుపద్మ
బంధుండు చక్షువు ప్రాణితతికిఁ
దగ నేకమయ్యుఁ బ్రధానంబు కార్యరూ
పమునఁ జూడఁగ బహుత్వమ భజించు
నాధారహీనమై యధికమైనది పర
బ్రహ్మ మల్పం బనల్పంబు వ్యాపి


తే.

పరఁగ సదసత్తు లనఁగ నక్షరము క్షరము
నన్య మీరెంటికిని బరమాత్మఁ దలఁప