పుట:Shriiranga-mahattvamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

81


స్థలమున మలయానిల మడు
చలిత తరంగానుమేయ సలిలం బగుచున్.

152


క.

ఏపారు చంద్రపుష్కరి
ణీపరిసరభూమి రంగనిలయ మిడియె-నా
లోపల నచ్చోళనృపతి
తాపసులును వచ్చి రతిముదంబున నటకున్.

153


ఆ.

వచ్చి దైత్యవంశవరునకు నుచిత స
త్కృతు లొనర్చి భక్తి యతిశయింప
రంగశాయి చరణరాజీవపూజనం
బాచరించి ప్రముదితాత్ము లయిరి.

154


వ.

అంత ననంతగుణగరిష్టుండగు నాదనుజశ్రేష్ఠుం డాసరోవరంబునం గరంబు
నియమంబునఁ దత్కాలకరణీయంబు లాచరించి సమంచితోపదారపూర్వకం
బుగా సావధానంబున శ్రీరంగరాజపూజావిధానంబు దీర్చి సప్రదక్షిణ
ప్రణామం బాచరించి వేదశాస్త్రపురాణోక్తంబు లగు శ్రీవైష్ణవసూక్తంబుల
నభినుతించి గమనోన్ముఖుండైన యతనికిఁ గృతాంజలియై యన్నరేంద్రుం
డిట్లనియె,-

155


క.

అకుటిలమానస సుజన
ప్రకటితసౌజన్య జన్యపాటిత వినుత
ప్రకర మముఁ గూర్చి యిచ్చట
నొకకొన్నిదినంబు లెలమి నుండఁగవలయున్.

156


ఉ.

నావుడు నాతఁడెల్లి మనువందన మా ఫణిరాజశాయికిన్
శ్రీవెలయంగ నుత్సవముచేసిన యట్టిదినంబు గావునన్
భూవర మత్పురంబునకుఁ బోవలయన్ వెస నన్న నాదశ
గ్రీవుసగర్భుతోడ నృపకేసరి యిట్లను నెమ్మిఁ గ్రమ్మఱన్.

157


మ.

విమలంబై తనుపొందునీయుభయకావేరీ సరిన్మధ్య మీ
రమణీయోన్నత సైకతస్థలము లీ రాజీవషండంబు లీ