పుట:Shriiranga-mahattvamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

ద్వితీయాశ్వాసము


వ.

ఎట్లనిన.

130


ఉ.

లోకభయంకరుం దశగళుం బరిమార్చుట కేను రామభ
ద్రాకృతి నర్యమాన్వయమునందు జనించి యయోధ్యలోనఁ బు
ణ్యాకరమైన రంగనిలయంబు విభీషణు కిత్తు నాబుధ
శ్లోకుఁడు దేర మీరు ననుఁ జూచెద రీడ ననంతపీఠికన్.

131


వ.

అని యానతిచ్చి యప్పరమేశ్వరుం డరుఁగఁ దోడనకూడి నేను మును మార్తాండ
మండలపర్యంతంబును గొలిచి చని మరలి వచ్చునెడ భవద్వంశకర్త యగు
వికర్తనుండు మమ్ముఁ గనుఁగొని యిట్లనియె.

132


సీ.

మున్ను పద్మజలోకమున రంగశాయి నే
నర్చించి మద్వంశ్యులైన నృపులు
దేవ! నీచరణాబ్జసేవ సేయఁగ నుండ
వలయు నీవని మ్రొక్కి వరముగాఁగ
గోరిన గరుణ గల్గొని యయోధ్యాపురిఁ
గావేరిదరిఁ జిరకాల మేను
వసియించి ప్రీతి భవత్కులీనులచేతఁ
బూజఁ గైకొనియెద భూరిదారు


తే.

ణౌఘ కలివేళ గతిశూన్యమైన ప్రాణి
తతికి సులభుఁడ నయ్యెద-ధర్మరహితు
లైన నాస్తికు లెపుడు క్రందై చరింతు
రపుడు దుర్లభమగు నస్మదాశ్రయంబు.

133


వ.

అని యానతిచ్చెఁ గావున శ్రేయోభిలాషంబు లగువారికి గావేరీ తీరంబున
చోళవంశసంభవుండైన ధర్మవర్మాపదేశంబున నవశ్యంబును శ్రీరంగ
నాయకుండు వేంచేయునది తప్పదని చెప్పిన లోకబాంధవు భాషణంబులఁ
బరితోషణంబు నిగుడ మగిడి వచ్చి యచ్చట నున్నవార మచ్యుతుండును
దాశరథియై యవతరించినాఁ డచిరకాలంబునన యస్మన్మనోరథంబు సిద్ధించు,
రఘునాథ దయాభూషణం డగు విభీషణుం డెప్పుడిచ్చటికి రంగధామంబుఁ