పుట:Shriiranga-mahattvamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

71


తే.

సకల శుకముఖ్య మునియోగిజన సమగ్ర
మహిత నిగమార్ధ సంస్తూయమాన మగుచు
వచ్చె మానసవేఁగమై వనజగర్భ
దాసభయకర్శనంబు-సుదర్శనంబు-

102


వ.

ఇట్లు వచ్చు నమ్మహాస్త్రరాజంబు తేజంబున దౌదౌలన దళితసంరంభంబై
దంభోళి పొడ వడంగిపోయినఁ గని జంభారి సిగ్గుపడి బెగ్గడిల దిగ్గన కనక
గర్భుపాలికిం జని తద్విధం బంతయుఁ జెప్పిన నప్పరమేష్టి యాశ్చర్యంబు
నొంది వైవస్వతనందను మనోరథమహత్త్వంబు దెలియం గోరి నిమీలితాష్ట
నయనారవిందుండై యానందంబున డెందంబునఁ గనువిచ్చి చూచి యా
భూవరోత్తము చిత్తము శ్రీరంగశయనప్రవృత్తం బగుటయెఱింగి-మైయెఱుం
గక యొల్లంబోయి మెల్లన తెలిసి నిజస్వామి యగుశ్రీరంగధాముని సన్నిధానం
బున కరిగి సురగణసమేతంబుగా సాష్టాంగప్రణామం బాచరించి, కృతాంజ
లియై ముఖకంజంబులు పుంజంబులుగా నూరకున్న యన్నలువపైఁ గృపాకటా
క్షంబు నిగిడించి పుండరీకాక్షుం డిట్లనియె.

103


చ.

జలరుహగర్భ నీదెసఁ బ్రసన్నుఁడ నేను విషాద మేల నా
తలఁ పెఱిఁగింతు నీకు నది తప్పదు విన్ము మదేతదంచితో
జ్వల శుభమూర్తితోఁ దరణివంశమహీధవ రాజధానియై
వెలయు నయోధ్య కేఁగెదను విశ్రుత రంగగృహాన్వితంబుగన్.

104


సీ.

అచట నిక్ష్వాకుధరాధీశ్వరుఁడు మొద
లయిన తత్కులజనతాధిపతులు-
గొలువ మహాయుగంబులు నాల్గు పరిపూర్ణ
మగుదాఁక నుండి యనంతరంబ
చోళమండలమునఁ జూడనొప్పారు కా
వేరీమహానది తీరమునను
జంద్రపుష్కరిణీల సత్రదేశమున మన్వం
తరంబులు రెండునైదు నిలచి


తే.

యంత భవదీయమగు దివసాంతమైన
నేఁగుదెంచెద నీయున్నయెడకు మగిడి