పుట:Shriiranga-mahattvamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరంగమహత్వము

49


ఆ.వె.

తుది మదీయభక్తి వదలని జనుల నా
చారులైన హీనజన్ములైన
వారి నితరబుద్ధి వారక నిందించు
వార లట నికృష్ణవర్ణసములు.

214


మ.

ధరఁ బెంపొందిన మత్ప్రపన్నుల మదుక్తంబైన శాస్త్రంబు మ
త్పరమార్థంబగు మంత్రరత్నమును, మత్ప్రాణప్రతీకాశమై
నిరపాయం బగురంగధామమును దుర్నీతిన్ విచారించి యె
వ్వరు దూషించుచు నుందు రాఖలులు జిహ్వాచ్ఛేద్యు లుద్యద్గతిన్.

215


క.

మఱచియు శ్రీరంగంబున
నెఱుఁగని యజ్ఞాన మూఢు లెవ్వరు గల రా
మొఱకుల కిడు నశనాదులఁ
దఱికొని శునకమున కొసఁగదగు ననిశంబున్.

216


క.

వారక సకలజనంబులు
శ్రీరంగంబనుచు సంస్మరింపుదురేనిన్
నారక నాకము లనియెడు
నా రెండును ఖిలముగావె యరవిందభవా!

217


తే.

మర్త్యలోకంబునందు నంబరమునందు
నెప్పు డెచ్చోట శ్రీరంగ మొప్పియుండు
నప్పు డాదిక్కునకు భక్తి నభిముఖంబు
గాఁగ నిలిచి నమస్క్రియాకారి వగుము.

218


వ.

అని యానతిచ్చి యాశ్రితనిస్తారకుం డూరకుండెఁ దచ్ఛాసనంబున వారిజాస నుండును నిశ్రేయసనిదానం బగు నద్దివ్యవిమానంబు గొని సత్యలోక సీమాంతంబున విరజానది ప్రాంతంబున విశ్వకర్మ నిర్దేశంబున బ్రతిష్టాపించి,
నిరంతరానురక్తదివ్యోపచారవిరాజిత పూజావిధానంబున నద్దేవుని నారాధించుచు నారాయణనక్షత్రంబునం బరమహర్షంబున బ్రహ్మర్షి సహాయుండై మహోత్సవం బొనర్చి, యవభృధానంతరంబున నింద్రాది బృందారకబృంద పరివృతుండై వందారు మందారం బగు నానందకపాణి సందర్శనంబు గావించి, యావేళ నుదారస్వాంతుం డగు వివస్వంతునకుఁ