పుట:Shriiranga-mahattvamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

7


త్సమ్మదకారు లుదారులు
సమ్మర్దితచటులకుటిలశాత్రవవీరుల్.

32


వ.

వెలయుచుండ.

33


సీ.

ఈప్రధానశ్రేష్ఠు కెనవచ్చు గనకాద్రి
        భవునిచేఁ దలవంపు పడకయున్న,
నీసచివాగ్రణితో సమం బగు వార్ధి
        యఱచేతిమాత్రలో నడఁగకున్న,
నీయమాత్యుని రహి కెక్కుఁ గల్పకశాఖి
        భూలోకమున వీటిఁబోకయున్న,
నీమంత్రిమణికి జో కౌ మీనకేతనుఁ
        డంగవైకల్యంబు నందకున్న


తే.

 ధైర్యగాంభీర్యదానసౌందర్యములను
ననఁగ నాశ్రితవిద్వదర్థార్థిబంధు
మిత్రసంతతభాగ్యలక్ష్మీవిలాస
బంధురుం డొప్పుఁ జాగయప్రభువరుండు.

34


చ.

అతులధృతిం దనర్చి విబుధాశ్రయమై, క్షమఁ బూని భూమిభృ
త్తతి కతిమాన్యయై, యచలతామహిమన్ మహి కెక్కియున్, జన
స్తుతుఁడగు చాగయప్రభువుతో సరిగాదుసుమీ సుపర్వప
ర్వతమురుధర్మకార్యమున వక్రత నొందుట దక్కకుండుటన్.

35


వ.

తదనుసంధవుండు.

36


శా.

శ్రీవిభ్రాజితుఁ, డుల్లసద్గుణమణిశ్రేణీసుధాంభోధి వి
ద్యావాణీపతి, యన్యరాజసచివోద్యద్వంశ వంశాటవీ
దావజ్వాలి, ముకుందపాదకమలద్వంద్వార్చనోత్సాహి యా
గోవింద ప్రభుఁ డొప్పు బంధుజనచక్షుఃపూర్ణిమాచంద్రుఁడై.

37


ఆ.

అయ్యమాత్యమణికి నంగనారత్నంబు
మాణికాంబకును, సమగ్రబాహు