పుట:Shriiranga-mahattvamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ప్రధమాశ్వాసము


క.

శ్రీరంగరాజమహిమో
దారం బది కృతిదలంవఁ, దత్పతి సుగుణో
దారుఁడు రాఘవుఁడఁటె శుభ
కారణమగు నిట్టిపొందు గలదే యెందున్.

26


క.

చెప్పెదఁ గావ్యము రసములు
చిప్పిల వర్ణనల నింపు చిలుకగఁ బాకం
బుప్పతిలఁ, జిత్రరచనలు
చొప్పడ శబ్దార్థఘటన సుకవులు మెచ్చన్.

27


వ.

అని అమ్మహామంత్రి చింతామణిచేత నత్యంతబహుమానపూర్వకముగాఁ గర్పూరసమేతం బగుతాంబూలంబు గైకొని సమ్మదంబున నిమ్మహాపురాణకధ రచియింప నుపక్రమించితి నిట్టి కృతినాయకు నన్వయక్రమం బెట్టిదనిన.

28


మ.

జగముల్ మూఁడు తలంపులోపల జనించం జేయు వాగ్వల్లభున్
మిగులం గూర్మితనూజుఁగాఁ గనిన లక్ష్మీనాథుఁ డెవ్వానికిన్
బొగడొందన్ సుతుఁడయ్యె నట్టి సుమహత్పుణ్యుం బ్రశంసింపఁగాఁ
దగదే కశ్యప సన్మునీంద్రుని విశుద్ధజ్ఞాననిస్తంద్రునిన్.

29


క.

ఆ మునివంశసుధాంబుధి
సోమునికరణిం జనించె సురుచిరలక్ష్మీ
ధాముఁడు కేశవదేవ మ
హామంత్రీశ్వరుఁ డుదారయశుఁడై వసుధన్.

30


క.

అతని కతిభాగ్యలక్షణ
వతి మాదాంబికకు నుద్భవంబయ్యె జగ
న్నుతచరితుఁ డబ్జమిత్ర
ప్రతిమానుఁడు మాయిదేవపండితుఁ డెలమిన్.

31


క.

అమ్మంత్రిమణికి బొమ్మా
యమ్మకు సుతు లిరువు రుదయమై రఖిలజగ