పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

క్షేమముకొఱకుగాని, యితఁడు యాదవులలోనివారగు శ్రీకృష్ణసాత్యకుల క్షేమముకొఱకుగాని, విదురునివలె ముందు చెప్పి పంపకపోవుటయేకాక యీసమయమున శిబిరమునుండి తప్పించుకొని పోవువారినిఁ జంపుచుండిరి. విదురుఁ డట్లు చెప్పి పంపి యుండబట్టియేకదా పాండవులు లక్కయిండ్లలో మడియక బ్రదికిరి. యుద్ధానంతరమున గౌరవవీరులలో నిలిచియుండిన మువ్వురు వీరులలో నీతఁ డొక్కఁడై యున్నాఁడు.




__________