పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

73

8వ అధ్యాయము.

గుఱ్ఱాలవిషయము ఏమియుతెలియదని వారు గ్రహించిరి.

భగవంతుడు రసహీనుడు అనుట వెడగుమాట. ఆ ఉపన్యాసకునికితానుచెప్పెడివాక్కులఅర్ధము బొత్తుగ తెలియదు. అనంతమగుప్రేమ, జ్ఞానము, ఆనందములకు, అఖండనిధియగు పరమేశ్వరునిగూర్చి అతడుయిసుమంతయు తెలిసికొనియున్నవాడుకాడు.

216. ఇంకొకడు మతబోధను వృత్తిగా పెట్టుకొనినవాడుకలడు. ఆతడు బోధలుచేయునప్పుడు, శ్రోతలందు గాఢమగుభక్తిభావములను రేకెత్తునటుల చేయగల్గెడివాడు. కాని యతడుమాత్రము నీచప్రవర్తనగలవాడు. వాని నడవడికనుచూచి నొచ్చుకొని, అంతమందిహృదయములలో భక్తి బీజములనాటుచును, తానుకలుషజీవనమును గడుపుటయేలనని నేనతనిని ప్రశ్నించితిని. అతడుతలవంచుకొని "అయ్యా, చీపురు తానెంత ముఱికితోనున్నను, నేలమీదను, వీధులందును, కల్మషములేకుండశుభ్రపఱచగలదు."అనెను. ఇంకనేనేమియు ప్రతివచనము పలుకలేనైతిని.