265
40వ అధ్యాయము.
విసర్జనలేక అట్లుబ్రహ్మజ్ఞానముపొందినది. నీవున్ను జనకుడవని తలంచవద్దు. ఎన్నియుగములో గడచినవిగాని ప్రపంచములో మఱియొకజనకుడు యింతవఱకును పుట్టియుండలేదు.
748. పాచి చిన్నచిన్న ముఱుగుడుగుంటలయందు పెరుగునుగాని, మిక్కిలి పెద్దసరస్సులందు పెరుగదు. అటులనే స్వార్థపరత, కపటము, మూర్ఖతమూలముగా వెలసినకూటములందు పాక్షికసంప్రదాయము వర్ధిలును; కాని నిష్కళంకములై విశాలాశయములుగలిగి, స్వార్థరహిత వర్తనముతో వెలయు సమాజములందు అట్టిసంకుచిత విషయములు ప్రవర్ధనము కాజాలవు.
749. హిందూమతమునకును బ్రహ్మసమాజమతమునకును బేధమేమని ఒకబ్రహ్మసమాజభక్తుడు ప్రశ్నించగా శ్రీపరమహంసులవారిటులతెలిపిరి:- ఏకస్వరమునకును రాగమునకును గలభేదమేవానికున్నది. బ్రహ్మసమాజము "బ్రహ్మమను" ఒక్కస్వరముతో తృప్తిచెందుచున్నది. హిందూమతమున చాలస్వరములుకూడి మధురమౌ రాగముగ నేర్పడుచున్నవి.
750. భావమును స్వరూపమునుగూడ పాటించుడు; లోపలనుండు భావనయు పైకికాన్పించు ప్రతీకమును మాన్యములే.
751. వరిగింజ మొలకయెత్తి పెరుగుటకు అందుండు అంకురమే ముఖ్యావసరమయినదనియు, పైనిఊకప్రధానమైనది కాదనియు సామాన్యముగ తలంతురు. అయినను ఊకను తొలగించి బియ్యపుగింజను నేలలో నాటినయెడల, అందుండి