పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38వ అధ్యాయము.

సర్వమత సామరస్యము.

711. ఒకేనీరు వేర్వేఱుజాతులవారిచేత వేర్వేఱు పేరులతో పిలువబడును. ఒకజాతివారు జలమందురు; ఇంకొక జాతివారు పాని అందురు; వేఱొకజాతివారు వాటర్ అందురు; మఱొకజాతివారు యవ్యా అందురు. అట్లే సచ్చిదానందమయ పరబ్రహ్మమును కొందఱు దేవుడనియు, కొందఱు అల్లాఅనియు, కొందఱు హరిఅనియు కొందఱు బ్రహ్మ యనియు సంబోధింతురు.

712. పెద్దచెఱువునకు అనేకము రేవులుండును. ఏరేవున ఎవరు దానిలో దిగినను స్నానముచేయ వచ్చును. నీరుదీసికొని పోవచ్చును. ఒక రేవు మఱొకరేవుకంటె శ్రేష్ఠతరమని పోట్లాడుట వ్యర్థపుపని. అటులనే బ్రహ్మానందసరోవరమునకు చాలరేవులున్నవి. ఈరేవులలో దేనిగుండనైనను సరియే నిర్మలహృదయముతో శ్రద్ధాభక్తులతో సరాసరి పొండు. మీకు నిత్యానందజలము లభించగలదు. అంతేగాని నా మతము వేఱొకని మతముకన్న శ్రేష్ఠమని వాదులాడ బోకుడు.

713. భగవంతునికి అనేక నామము లున్నవి. ఆయనను చేర్చురూపములును అనంతములుగనున్నవి. నీకేనామము