పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32వ అధ్యాయము.

సన్యాసాదర్శము.

616. ఒకమనుష్యుడు, జబ్బుగానుండిన తనబిడ్డను చేతులలో నిడుకొని ఔషథముకొఱకై ఒక సాధువుచెంతకు పోయెను. మరునాడురమ్మని ఆసాధువు వానితో చెప్పెను. మరునా డతడురాగా "ఆబిడ్డకు మిఠాయి పెట్టకు; త్వరలోనె నెమ్మదించును" అని సాధువుపలికెను. అందు కామనుజుడు "అయ్యా! ఈమాట నాకు నిన్ననే చెప్పలేకపోతిరా?" అనగా సాధువు యిట్లనెను. "అవును. చెప్పెడివాడనే; కాని నిన్ననాముందటనే చక్కెరయున్నది అదిచూచి నీబిడ్డడు "ఈసాధువు తాను పంచదారమెక్కుచు యితరులను తినవద్దంటాడు; వట్టిమోసగాడు; అని పలికియుండును.

617. యోగులును సన్యాసులును పాములబోలువారు. పాము తనకై కలుగును త్రవ్వుకొనదు. చుంచు చేసికొనిన కలుగులోదూరి నివసించును. ఒక కలుగు నివాసయోగ్యము కానిచో మఱొక కలుగులో ప్రవేశించును.

అటులనే యోగులును, సన్యాసులును, తమకై యిండ్లను కట్టుకొనరు; ఇతరుల యిండ్లలోకాలము గడుపుకొందురు - ఈదినమున యీయింటిలో, రేపు వేరొకయింటిలో!

618. ప్రశ్న:- సన్యాసాశ్రమ స్వీకారమునకు తగినవాడు ఎటులుండును?