పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

204

బాలునివలెను, పిశాచమువలెను, పిచ్చివానిపోలికను, ఇంకను చాలమారువేసములతోడను తిరుగులాడుచుండును."

583. బలిపీఠము, బలియగు జంతువు, బలికై దానిని నఱుకు నరుడు, మువ్వురును ఒకే తత్వమని తెలిసికొంటిని.

584. ప్రతినరాకృతియందును భగవంతుడు చరించుచు పుణ్యులందును, పాపులందును శిష్టులందును, దుష్టులందును ఆయన ప్రత్యక్షమగుటను అపరోక్షముగ గ్రహించుదశకు నేనిప్పుడు వచ్చితిని. కావున నేను వేర్వేఱు జనులను కలియునప్పుడు యిట్లనుకొందును:- "సాధురూపమున భగవంతుడు దుష్టరూపమున భగవంతుడు, యోగ్యునిరూపమున భగవంతుడు, అయోగ్యునిరూపమున భగవంతుడు (అన్ని రూపములందును భగవంతుడే!")

585. భగవంతునియందు విద్య, అవిద్యరెండును కలవు. విద్యామాయ నరుని భగవంతునిదిక్కు నడపును. అవిద్యా మాయ వానిని పెడత్రోవకులాగి భగవంతునికి దూరముచేయును. జ్ఞానము, భక్తి, వైరాగ్యము, కరుణ, యివన్నియు విద్యామాయయొక్క సూచనలు; వీనిసాయమున భగవంతుని చేరవచ్చును.

కాని యింకొకమెట్టు పైకిపోతివా బ్రహ్మజ్ఞానములభించును. భగవంతుని పొందినట్లే ఈదశయందు భగవంతుడేసర్వమును అయ్యెనని నేనుగ్రహింతును. ఇంతేల ప్రత్యక్షముగ చూడగలను. అంగీకరించుటకుగాని, త్యజించుటకుగానిఏమియు లేదు. ఎవరిమీదనైనను నేనుకోపముపూనుట సాధ్యపడదు.

`