పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26వ అధ్యాయము.

ఈశ్వరానుగ్రహము

535. మలయమారుతము వీచునప్పుడు, చేవగలచెట్లన్నియు శ్రీగంధపుచెట్లుగ మారునందురు. చేవలేనిబొప్పాయి, వెదురు, త్రాటిచెట్టు మార్పుచెందక, ఉన్నట్లేయుండునట; అదేలాగున ఈశ్వరానుగ్రహము మానవకోటిపై కలిగినప్పుడు భక్తి సౌజన్యములుగలవారు పవిత్రఋషివరులై దైవమహిమతోనిండుదురు. ప్రాపంచికులగు క్షుధ్రజనులు ఎప్పటివలెనే యుందురు.

536. చెదఱి చంచలమైపాఱుచున్న నీరు చంద్రబింబమును విచ్ఛిన్నశకలములుగ (ముక్కలు ముక్కలుగ) తప్ప పూర్ణస్వరూపమును ప్రతిఫలింపజాలనిరీతిని ప్రాపంచకవాసనలతోడను వాంఛలతోడను కలతబారిన మనస్సులు భగవంతునితేజమును పూర్తిగ ప్రతిఫలింపజాలవు.

537. మౌనముగ భగవన్నామస్మరణచేయుచు ఒకపుణ్య పురుషుడు జపమాలత్రిప్పుచుండెడివాడు. భగవానుడు వానితోనిట్లనెను "నీవేల ఒక్కస్థలమును అంటిపట్టుకొనియుందువు? ముందునకుసాగిపొమ్ము."

"భగవదనుగ్రహము లేక అటులజరుగజాలదు." అని ఆపుణ్యపురుషుడు ప్రత్యుత్తరమిడెను.