పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13వ అధ్యాయము.

సాధుసంగము.

312. సాధువులయొక్కయు, జ్ఞానులయొక్కయు సహవాసము పారమార్ధికసాధనమున ప్రధానాంశములలో నొకటియైనది.

313. ధనికుడగు యొకజమీందారుని ప్రతినిధి పల్లెలకు పోయినప్పుడు అచ్చటిప్రజలను అనేకవిధములుగా పీడించును. అతడే తిరిగివచ్చి తన యజమానుని సమక్షమునయున్నప్పుడు, పరమయోగ్యుడయి జమీప్రజలను చాలా దయతో చూచుచు, వారికష్టములను జాగ్రత్తగా విచారించి, పక్షపాతము లేక న్యాయముకూర్చును. ఈప్రజాపీడాకరుడగు ప్రతినిధి యజమానును భయమువలనను, వానిసమక్షమందుండుటవలనను యోగ్యుడై మెలగును. అటులనే యుత్తముల సహవాసము దుర్మార్గులందుసహా భయభక్తులను పురికొలిపి, వారిని ధర్మానువర్తులనుగ మార్చును.

314. తడసినకట్టెలుకూడ నిప్పుమీద నుంచినయెడల త్వరలోనేయెండి, బాగుగమండును. అటులనే సాధుసంగము పామరుల హృదయములందలి లోభమోహములను తేమను హరించును. అంతట వివేకాగ్ని వారియందు రగుల్కొని ప్రజ్వరిలగలదు.

315. జీవితమును ఎటుల నడుపవలయును ? -