పుట:Shodashakumaara-charitramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

85


పద నైలింపవధూజన
సదమలవిలసనముతోడ సరియై యునికిన్.

26


క.

ఆవీడు మేఘమాల
క్ష్మావల్లభుఁ డేలు నతని గాదిలిసుత హం
సావళి గతినిర్జితహం
సావళి యన నొప్పు మిగుల నవనీనాథా.

27


సీ.

కమలాక్షు చేపట్టు గలిగియు శంఖంబు
        పూఁబోఁడికంఠంబుఁ బోలదయ్యె
నజునకుఁ బుట్టిని ల్లయ్యునుం దామర
        బాలికకనుదోయిఁ బోలదయ్యె
భవు నాశ్రయించియుం బాలేయకరరేఖ
        లోలాక్షినిటలంబుఁ బోలదయ్యె
మదనుని గుణ మయ్యు మధుకరమాలిక
        పొలఁతికుంతలములఁ బోలదయ్యె
ననిస సర్వాంగపరవిలాసాభిరామ
యైన హంసావళికి నెనయైనసతులు
గలరె మనుజేంద్ర మూఁడులోకములయందు
నాలతాతన్వి తనుఁదాన పోలుఁగాని.

28


గీ.

చన్నుదోయి చాల నున్నతిఁ జెలువొందెఁ
బెరుఁగుఁ గటియు దాన పిన్న ననుచుఁ
బడఁతినడుము సిగ్గుపడి డాఁగెనోనాఁగ
నారుమాటునంద యడఁగియుండు.

29


సీ.

నెలచందురునికాంతి నెమ్మోము సృజియించి
        యకలంకవిలసనం బలవరించి