పుట:Shodashakumaara-charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

షోడశకుమారచరిత్రము


బృందారక బృందార్పిత
మందారలతాంతసురభిమందిర యగుచున్.

20


గీ.

అమ్మహాదేవి లీలావనాంతరమున
బాల్యమున నేను విహరింపఁ బరమయోగి
యొక్కరుఁడు వచ్చి కదలక యుం
.................................

21


(ఇక్కడ గ్రంథపాతము)

ఉ.

...........................................
..............................................
........................... లనొల్లక నన్నెకోరెడుం
గావలయుం దదాప్తకృతిగాఁ దగునార్యఁ దలంచి చూడఁగన్.

22


వ.

అని నిశ్చయించి ధీరోదాత్తుం డగుట సభాజనులసన్నిధి నడుగక యేకాంతంబున నడుగం దలంచి నానావిధభూషణచీనాంజరంబులు నలిమధురరసవత్ఫలంబులు నొసంగి శుకంబుతోడం గళావతిని వీడుపట్టున కనిచి సత్వరంబుగా మజ్జనభోజనంబు లొనరించి యేకతంబున నుండి కళావతిని రావించి యారాజశుకంబుతో నిట్లనియె.

23


క.

శుకవర నీచదివినయా
ర్యకు రెండర్థములు గలిగినట్లున్నవి చె
ప్పక మాకుఁ దెలియకున్నది
ప్రకటంబుగఁ జెప్పు దీని భావము దెలియన్.

24


వ.

అనవుడు శుకం బిట్లనియె.

25


క.

త్రిదశాధిపుపురిపోలిక
విదిశాపురి యొప్పు మాళవీవిలసనసం