పుట:Shodashakumaara-charitramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

77


వేతాళుని బూజించెను
నాతఁడు గడు వరదుఁడయ్యె నాసమయమునన్.

151


వ.

పితృవననివాసుఁ డైన పరమేశ్వరుండు సర్వదేవపరివృతుం డై పుణ్యశ్లోకుం డగు నమ్మహీకాంతునకు సన్నిధిచేసి యతనికి విద్యాధరచక్రవర్తి పదం బొసంగి యంతర్హితుం డయ్యె నంతం బ్రభాతం బగుటయు మహేశ్వరప్రసాదంబున విద్యాధరులు వచ్చి తోడఁ గొనిపోవ విద్యాధరచక్రవర్తి పదంబున కభిషిక్తుం డై నిజపురంబున కరుగుదెంచి యుభయరాజ్యసౌఖ్యంబుల ననుభవించుచుఁ బెంపొంద నక్కాలంబునందు.

152


మ.

అహిలోకంబునఁ బన్నగేశ్వరసముద్యత్కాంతిఁ బోషించుచున్
మహి దుగ్ధాబ్ధి హిమాగతారనగధామవ్రాతము ల్విస్ఫుర
న్మహిమం గూర్చుచు నింగి తారరుచులం బాలించుచు న్సర్వలో
కహితుం డానరనాథుకీర్తి పరఁగెన్ గంగాప్రవాహాకృతిన్.

153


క.

అనుచుఁ ద్రివిక్రమసేనుని
వినుతచరిత్రంబుఁ జెప్పి వేతాళుఁడు నా
కును వాహనముగఁ జేయుట
కనుకూలం బైన మంత్ర మది దయ నిచ్చెన్.

154


వ.

ఆమంత్రం బత్యంతనిష్ఠతో ననుష్టించి తత్ప్రభావంబున వేతాళవాహనుండ నై వచ్చి దేవరం గాంచి ధన్యుండ నైతి ననిన నక్కుమారకేసరి విక్రమకేసరి నభినుతించి రానిచెలుల కెదురుచూచుచుఁ బూజ్యసామ్రాజ్యభోగంబు లనుభవించుచు నొక్కనాఁడు.

155