పుట:Shodashakumaara-charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

షోడశకుమారచరిత్రము


గూడియు సమ్మదంబు నొడఁగూర్చెను మేనులు చూడ్కి భీతి న
ల్లాడియుఁ బొల్చె నీసతులయందము సుస్థితి నెట్టులుండునో.

135


వ.

అని యిట్లభినందించి సమయంబు చేసికొనినవిధంబునం బెద్దయడుగులముద్దియం దండ్రియుం గుఱుచయడుగులతెఱవఁ బుత్రుండును నత్యనురాగంబునం గైకొని పురంబునకుం గొని చని యల్లన నయ్యింతులవిధం బంతయు నెఱింగి.

136


క.

కుఱుచడుగులయది తల్లియుఁ
గుఱుచలు గానడుగులయది కూఁతురు నయినన్
వెఱఁగంది వారినియతిం
దొఱఁగక వరియించి రరయ దుర్నయ మైనన్.

137


వ.

అని కథ చెప్పి వేతాళుండు నరేంద్రా వారిరువురకును నవ్వారిజనేత్రలవలన ననేకపుత్రు లుదయించిరి తత్తనయులు దమలోన నేమి యగుదు రని యడిగిన.

138


క.

ఎప్పగిది విచారించినఁ
జెప్పంగానేర రాక చింతాకులుఁ డై
చెప్పఁగరా దీప్రశ్నముఁ
జెప్పు మనుచు నడిగె నేమి సేయుదు ననుచున్.

139


వ.

నిర్విణ్ణుం డై మౌనంబునం జనుచున్న యమ్మానవేంద్రువలన సంతుష్టుం డై వేతాళుం డిట్లనియె.

140


మ.

ధరణీనాయక నీదుశౌర్యమును సత్యంబుం బ్రతాపంబు ని
ద్ధర నెవ్వారికి లేదు నీ దగుచరిత్రం బెప్డు విన్వారలం
గర మర్థిం బులకింపఁ జేయుచు శిరఃకంపంబు చేయించు నీ
సరిగా సన్నగఁ బోలు రాజు గలఁడే సర్వజ్ఞచూడామణీ.

141