పుట:Shodashakumaara-charitramu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

షోడశకుమారచరిత్రము

(10) ధర్మరాజుకథ

క.

మనుజేశ ధర్ముఁ డనియెడు
మనుజాధీశ్వరుఁడు, తొల్లి మార్తుర చేతన్
ధనమును రాజ్యముఁ గోల్పడి
తననగరము విడిచి తరళితస్వాంతుండై.

124


క.

ఆవిభుఁడు ఖడ్గదీప
వ్యావృతహస్తుఁ డయి చంద్రవతి యనుదేవిన్
లావణ్యవతి యనెడుసుత
నావనమునఁ గొనుచు నొకఁడు నరిగెడు వేళన్.

125


చ.

అలఘుమణిద్యుతం బొలుచు నావిభు భూషణరాగుఁ జూచి బో
యలు గడువీఁకఁ దాఁకుటయు నందట మున్మిడిశాతహేతి ని
ర్దళితులఁగా నొనర్చి భుజదర్పము మానక నిల్చి వారిచే
నలుగులవేదన న్వివశుఁ డై హరివీటికిఁ దాను నేగినన్.

126


ఉ.

అన్నరనాథుఁ డీల్గుటయు నాతని కామిని దానుఁ బుత్రియు
న్విన్నఁదనంబు దోఁప నటవీస్థలి నేగెడుచోటఁ జన్నులుం
బెన్నిఱివేణులున్ జఘనబింబములుం గడు వీఁగఁ జేయఁగా
సన్నపుఁగౌను లెంతయును సంచల మందఁగ నార్తి గూరుచున్.

127


క.

ఉలుకుచు నేగిరి వెస బె
బ్బులిరాకకుఁ దొలఁగులేళ్ళపోలికి భయసం
చలితవిలోచననీలో
త్సలరోచులు గప్పి విపినభాగము లొప్పన్.

128