పుట:Shodashakumaara-charitramu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

69


గాంతినిధి రాజలక్షణ
వంతు శుభాకారు నొక్కవరసుతుఁ గాంచెన్.

106


వ.

ఆపుత్రుఁ గాంచిననాఁటిరాత్రి గౌరీరమణుండు రమణికి గలసన్నిధిసేసి యిట్లని యానతిచ్చె.

107


మ.

తరుణీ నీసుతుఁ బెట్టెలోనిడి నృపద్వారంబునం బెట్టు మే
వ్వరునుం గానకయుండ నిఫ్టు చని లేవం గాంచి సూర్యప్రభుం
డురుతేజంబున వానిఁ జూచి మదిలో నుప్పొంగుచుం బుత్రుఁగా
నిరవద్యోత్సవలీలమైఁ బెనుచు వీని న్నాదు దివ్యాజ్ఞ మై.

108


వ.

అనుటయు.

109


క.

పతి లేనిసుతుఁడు గలుగుట
యతినింద్యం బగుట మున్న యాత్మ వగచున
య్యతివ పరమేశునానతి
నతిసంతోషంబు నొందె నాక్షణమాత్రన్.

110


చ.

తనకపు డీశ్వరుండు విదితంబుగ నత్తెఱఁ గెల్లఁ జెప్పిన
న్విని ప్రియ మంది సజ్జ నిడి నిర్మలచేలము గప్పి తత్సుతుం
బెనుచు ఋణంబులేమికయి పెంపున మాడలు వేయి కొంగునం
దొనరఁగఁ గట్టికొంచుఁ జని యుంచెను రాజగృహంబు వాకిటన్.

111


వ.

అ ట్లెవ్వరు నెఱుంగకుండ నప్పట్టిం బెట్టి వచ్చి యక్కోమటిలేమ తనతల్లి గృహంబున నిశ్చింతంబున నుండె నంతకమున్న మేదినీకాంతుండు సంతానార్థియై పరమేశ్వరప్రార్థనంబు చేయుట నద్దేవుండు కరుణించి నాఁటిరాత్రి కలలోనం బొడసూపి యఖర్వసార్వభౌమపాత్రం బగు పుత్రుండు ప్ర