పుట:Shodashakumaara-charitramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

షోడశకుమారచరిత్రము


నీసొమ్ము నిన్నుఁ గైకొను
నాస యుడిగె నాథుకడకు నరుగు మనుటయున్.

80


క.

తన పతికడకుం దాఁ జని
వనితామణి తాను బోయి వచ్చిన విధ మె
ల్లను జెప్పిన విని పతి మె
చ్చొనరఁగఁ గైకొని సుఖాబ్ధి నోలలనార్చెన్.

81


వ.

అని కథ చెప్పి వేతాళుండు.

82


క.

ఆమువ్వురలో సాత్త్విక
తామహితుం డారయ ధనదత్తుఁడొ చోరుం
డో మగువమగఁడొ యనుటయు
నామనుజాధీశుఁ డిట్టులను నాతనితోన్.

83


సీ.

పరపురుషునికడ కరిగెద నన్నప్డ
        విడువంగఁదగు నింతి విడువఁడయ్యెఁ
దలపోయఁగ సముద్రదత్తు చిత్తంబున
        సత్త్వగుణంబు లేశంబు లేదు
పరశాంత నృవదండభయమునఁ గవియని
        ధనదత్తునందు సత్త్వంబు లేదు
ముచ్చు ప్రాణములపై వచ్చినం జేరిన
        యర్థంబు విడువని యట్టివాఁడుఁ
దలఁప నిట్లయ్యె లోభ మింతయును లేక
మణివిభూషలు మానినీమణియుఁ దనకు
నబ్బి యుండఁగఁ బొ మ్మని యట్లు పనిచె
జగములోపలఁ జోరుండె సాత్త్వికుండు.

84


వ.

అనిన వేతాళుండు జనపతికి నదృశ్యుం డగుచు వృక్షంబున