పుట:Shodashakumaara-charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

పంచమాశ్వాసము


న్వనితలు నేఱులు న్మగిడి వచ్చుట గల్గునె పాసిపోయినన్.

76


క.

అనవుడు నావనజానన
తనవృత్తాంతంబు జెప్పి తడయక వత్తుం
జననిమ్ము బొంక నావుడు
విని చోరుం డాత్మలోన విస్మితుడగుచున్.

77


సీ.

వామాక్షి క్రమ్మఱ వచ్చుట నిజమేని
        మును నీవు ధర్మదత్తునకుఁ జేసి
నట్టి సత్యము సేయు మనుటయుఁ బ్రియమంది
        యాపద్మలోచన యట్ల చేసెఁ
దస్కరుకడఁ బాసి ధర్మదత్తునిపాలి
        కరుగుటయును జోద్యమంది యతఁడు
సత్యంబు దప్పక చనుదెంచినప్పుడ
        వరదేవతవు నీవు పద్మగంధి
కన్య వైననాఁడు కడువేడ్కఁ గోరితి
గాని యిప్పు డన్యకాంత వైతి
కాన నన్నుఁ జేరఁ గాంతునిపాలికిఁ
జనుము నెమ్మి ననుచుఁ బనుచుటయును.

78


క.

ఇంతి యసత్యభయంబున
నెంతయు వెసఁ జోరుకడకు నేగి తనదువృ
త్తాంతముఁ జెప్పిన మది న
త్యంతాశ్చర్యంబు నొంది యాతఁడు కరుణన్.

79


క.

నీసత్యమునకు మెచ్చితి
నీసత్యముఁ దగవుఁగలదె యింతులకెందున్