పుట:Shodashakumaara-charitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

షోడశకుమారచరిత్రము


నెడపని పలుకులమ్రోఁతయు
గుడిఁ బ్రతిరావమును శ్రవణఘోరంబయ్యెన్.

173


క.

తెలతెలవాఱినఁ బౌరులు
గలవారందఱును జూచి కలకల నగఁగా
బలునగుఁబాటుల కోర్వక
యిలపై నా జంత కూలి యీల్గె రయమునన్.

174


వ.

ఏ ని ట్లాగోరంపుజఱభి యభిమానంబును బ్రాణంబునుం గొని సమాధానంబున రూపిణితో నభిమతసుఖంబు లనుభవించుచు నున్నంత.

175


క.

కమలాకరుఁ డనుపతి చి
త్రముగాఁ దనమంత్రివరుఁడు వ్రాసిన నిజమై
నమహాపురి నున్నాఁ డ
త్యమితోన్నతి ననుచు జగము లాడఁదొడఁగినన్.

176


క.

ఆవార్తలు విని తత్పతి
వీవని మది నిశ్చయించి యిచ్చయలరంగా
నావనితారత్నమునకు
నావృత్తాంతంబు చెప్పినం బ్రియ మెసఁగన్.

177


క.

ఏనును నీవుఁ గదలి య
మ్మానవపతి పురికిఁ బోదమా యనవుడు న
మ్మానినివచనంబుల క
త్యానందముఁ బొంది సకలధనములుఁ గొనుచున్.

178


ఉ.

దేవరఁ గాన నర్థిఁ జనుదేరఁగ నొక్క వనంబులోఁ గిరా
తావలి నన్నుఁ దాఁకిన నుదగ్రత నందఱ కన్నిరూపులై