పుట:Shodashakumaara-charitramu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

43


నిఖిలభాగవతాగ్రణి నిన్నుఁ గంటిఁ
బరమపుణ్యుని గాంచిన ఫలముఁ గంటి.

159


వ.

అనిన నెంతయు సంతసిల్లి కనకరత్నమయంబు లగు శంఖచక్రంబులును గదాంబుజంబులును చెప్పించి యవి యద్దేవునకు సమర్పింపు మని యిచ్చి నాకు దివ్యాంబరాభరణమాల్యంబులు నపరిమితకనకంబును నొసంగి యిరువురు దైత్యుల రావించి వీని నీవస్తుసంతానంబును భరియించి మదనోల్లాసపురంబు సమీపంబున నునిచి రండని పనిచిన వారు నన్నుం గొనివచ్చి యన్నగరంబు చేరువ నునిచి మగుడ నరుగ నత్యంతమోదాయత్తచిత్తుండ నై నాకిచ్చినధనంబు నొక్కకందువ దాఁచి తత్క్షణంబ.

160


చ.

కరముల శంఖచక్రములు గైకొని కాంచనరత్నభూషణో
త్కరములు దాల్చి నూతనవికాసమున న్మెయి నివ్వటిల్లఁగా
సరసిజనాభుపోల్కిని నిశాసమయంబున నేను రూపిణీ
వరసదనంబు సొచ్చుటయు వారనివేడ్కలు నివ్వటిల్లఁగన్.

161


క.

వనజాక్షుఁడు వచ్చె నటం
చనుమోదముతోడ నిదియు నమ్మయు సాష్టాం
గనమస్కృతు లొనరించినఁ
గని నాచేఁ జిక్కిరనుచుఁ గౌతుక మెసఁగన్.

162


గీ.

నేఁడు మొదలుగ వరియింతు నిన్ను నింక
నొరులఁ జేరంగనీ నన నుల్లసిల్లి
పుష్పకోమల యనురక్తిఁ బొంది యుండ
మకరదంష్ట్రయుఁ జిక్కె నామాయఁ దగిలి.

163