పుట:Shodashakumaara-charitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

37


క.

ఈమదిరావతితల్లియు
నామాతయుఁ దోడఁబుట్టినా ర ట్లగుటన్
భూమీశునాజ్ఞఁ బెండ్లికి
నే ముదమున వచ్చి కంటి నిచ్చట నిన్నున్.

134


వ.

అని చెప్పిన నత్యంతసంతుష్టాంతరంగుడ నై మదిరావతీకల్యాణనిమిత్త మదిరాపానమత్తపరిజన ప్రతీహార ద్వారపాలాదుల వంచించి వచ్చితి నని చెప్పిన నుప్పొంగుచు నీ ప్రొద్ద కదలి యిద్దఱము నన్నార్థుల(?)మై యింతులం దడవికొని కాంతారమార్గంబున నరుగుదెంచి యిచ్చట దేవరం గాంచి కృతార్థుల మైతి మని చెప్పిన నద్భుతరసాయత్తచిత్తుం డయ్యెఁ దదనంతరంబ.

135


క.

ఆనరనాయకుఁ డత్తఱి
నేనిక వేఁటాడ దూర మేగి యొకమహా
కాననములోన దుర్గా
స్థానముఁ గని యచటఁ జేరఁ జనియెడునంతన్.

136


వసంతకునికథ

క.

పరమేశ్వరి కతిభక్తిని
నరబలి యొనరింప వచ్చినకిరాతులు ద
న్నరపాలునిఁ గని పట్టిన
నరుల విడిచి భీతిఁ గాననముఁ దూఱుటయున్.

137


క.

బుద్ధ్యధికుండు వసంతకు
వధ్యశీలాగ్రమునఁ గాంచి వసుధాధీశుం
డధ్యానందుం డగుచున్
విధ్యనుకూలతకు నాత్మ వికసిల్లంగన్.

138